సత్యసాయి: పుట్టపర్తిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. భూ వివాదాలు, మ్యుటేషన్ దస్త్రాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.