SKLM: శనివారం టెక్కలి నియోజకవర్గంలో MLC దువ్వాడ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నందిగాం మండలం, టెక్కలి మండలం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో మరణించిన కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించారు. అనంతరం కోటబొమ్మాళిలో చింతల సింహాద్రి కుమార్తె మరణించగా రూ.20,000 ఆర్థిక సహాయం అందజేసి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.