CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద ఓ చింత చెట్టు కింద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా పదిమంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ. 13200 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.