CTR: బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గ్రామంలోని ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాలును కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.