AKP: మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తూ మృతి చెందిన వేతన దారుడు రాము కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. సోమవారం గ్రామంలో మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపాధ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.