NTR: జీ. కొండూరులో కొలువుదీరిన కార్యసిద్ధి శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద నవధాన్యాలు సమర్పించారు. ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.