కాకినాడ: చిన్నారి మృతికి కారణమైన తండ్రిని జగ్గంపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గత నెల 26న ఒడిమని మణికంఠ మద్యం మత్తులో తన భార్య సాయమ్మతో గొడవపడి ఇంట్లో నిద్రిస్తున్న 11 నెలల కూతురిని స్కూటీపై ఎక్కించుకుని గుర్రప్పాలెం రోడ్లో ఉన్న పోలవరం కాలువలో దూకడంతో చిన్నారి మృతి చెందింది. దీనిపై స్పందించిన పోలీసులు చిన్నారి మృతికి కారణమైన మణికంఠను అరెస్టు చేశారు.