ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ 45 ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా మోసపూరిత లావాదేవీలు, భూ తగాదాలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు సూచించారు.