ASR: డుంబ్రిగూడ మండలంలోని అడపవలసలో శుక్రవారం గంజాయి నివారణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డుంబ్రిగూడ ఎస్సై ఎల్. సురేష్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గంజాయి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.