VZM: విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ డీఏలు, సర్వీస్ సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని సంఘీభావం తెలిపారు.