KDP: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ లేబర్ కార్డు తీసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను లబ్ది పొందాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.గంగా సురేష్ అన్నారు. ఆదివారం ఎర్రగుంట్ల ఏఐటీయూసీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భావన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వివరించారు.