E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, వైద్య సదుపాయాలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుంచి పూర్తిగా కోలుకోవాలన్నారు.