ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో పలు అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లే విధంగా కృషిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలన్నారు.