TPT: మొనకూరు పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో రూరల్ సర్కిల్ సీఐ, ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు నిర్వహించి, రికార్డులు లేని 15 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవనం, గంజాయి వినియోగం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. మహిళలు, పిల్లల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తనతో కొనసాగాలని సూచించారు.