కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో మహానందీశ్వర స్వామి వారి అభిషేకం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వైదికంగా పూజలు నిర్వహించగా భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.