E.G: దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో సాగవుతున్న జీడి మామిడి తోటల్లో ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉండటంతో మంగళవారం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది వర్షాభావం వల్ల దిగుబడి తగ్గగా, అప్పుడు క్వింటా ధర రూ.12,000 పలికింది. ఈసారి వాతావరణం అనుకూలించి పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని, గిట్టుబాటు ధర లభిస్తుందని రైతాంగం ఆశిస్తోంది.