NDL: బండి ఆత్మకూరు మండలం వెంగలరెడ్డి పేటలో శనివారం ఎస్సై జగన్మోహన్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, బాల్యవివాహాల నివారణ, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని SI హెచ్చరించారు.