నంద్యాల పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.