TPT: తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కొత్త కండ్రిగ గ్రామానికి చెందిన రాజా, అమరావతికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలు కారణంగా అమరావతి సోమవారం పురుగులు మందు తాగింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.