TPT: ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ. కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.