RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు ఇవాళ మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలకు మూడు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసులు వారిని విచారించనున్నారు. కాగా, చంచల్ గూడ జైలులో నిందితులను మరికాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు.