E.G: రాజమండ్రి నగరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఎం.ఆర్.ఆర్ తార్వి, డీ. రితిక్ అనే ఇద్దరు చిన్నారులు కోలుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వారు చెప్పారు.