TRPT: పద్మావతి నగర్, ఎస్బీఐ బ్యాంక్ కాలనీలోని వ్యభిచార గృహంపై తిరుచానూరు పోలీసులు మంగళవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ముగ్గురు మహిళలతో పాటు ఓ విటుడు, వ్యభిచార గృహం నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడి చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.