AP: బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘స్థానిక ఎన్నికలు వచ్చే సమయానికి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాము. కొన్ని బీసీ వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయి. గిరిజనుల కోసం తెచ్చిన జీవో 3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై గిరిజనుల అభిప్రాయాలు సేకరించి ముందుకెళ్తాం’ అని తెలిపారు.