PLD: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన దుర్గి మండల పరిధిలోని ముటుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. కొల్లి హనుమయ్య (55) తన పొలంలో విద్యుత్ మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.