TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. డ్రగ్ నెట్వర్క్ కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.