తెలంగాణ అమర్నాథ్గా పిలవబడే సలేశ్వరం లింగమయ్య జాతర ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నల్లమల అటవీ ప్రాంతంలో వైభవంగా జరగనుంది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి మీదుగా సుమారు 30 కిలోమీటర్ల కాలినడకన లేదా మన్ననూరు మీదుగా భక్తులు ఈ జాతరకు చేరుకుంటారు. హైదరాబాద్ వాసులు MGBS నుంచి శ్రీశైలం బస్సెక్కితే చాలు. ఆమ్రాబాద్ ఫారెస్ట్ వద్ద దిగితే స్పెషల్ సర్వీసులుంటాయి.