NLR: గురుకులాల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ జి. మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. నెల్లూరు చిలమానుచేను పాఠశాలలో 5వ తరగతితో పాటు 6,7,8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.