PDPL రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మురికినీరు నేరుగా గోదావరిలో కలవడంపై బీఆర్ఎస్ నేతలు కౌశిక హరి, పర్లపల్లి రవి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నదిని పరిశీలించిన వారు.. వేసవిలో కార్మిక కుటుంబాలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం విఫలమయ్యాయని విమర్శించారు. కలుషిత నీటి వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు.