MDK: ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి జగదీష్ అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజావాణిలో 2 దరఖాస్తులు వచ్చినట్లు వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాసు పాల్గొన్నారు.