HYD: BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యలు వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయని TPCC అధికార ప్రతినిధి చరణ్ కౌషిక్ అన్నారు. ఆలయాలఅభివృద్ధిపై వారు మొసలి కన్నీరు కారుస్తూ, నిధుల వినియోగాన్ని అడ్డుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలకు నిధులు కేటాయిస్తుంటే, కేంద్రం మాత్రం తెలంగాణ దేవాలయాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు.