SRCL: తంగళ్లపల్లి మండలంలోని కాలేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎంసీ 11/6, 11/5, 11/4 కాల్వల పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు జిల్లా కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జ్యోతి అనిల్, అంచ శ్రీనివాస్ రెడ్డి, సాయికృష్ణ గౌడ్, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.