NDL: కూటమి ప్రభుత్వం వల్లనే రైతు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ అన్నారు. మండల కేంద్రం రుద్రవరం మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు.