హైదరాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను మరో 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఉప్పర్పల్లి కోర్టు విచారణ జరిపింది. అయితే, తీర్పును ఎల్లుండికి వాయిదా వేసిన న్యాయస్థానం, ఆ రోజే ఇరుపక్షాల వాదనలను మరోసారి విననుంది.