చిత్తూరు రూరల్ మండలానికి చెందిన కూటమి సర్పంచులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన సన్మానం నిర్వహించారు. ఏప్రిల్ 2తో పదవీకాలం ముగియనున్న సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీలోని కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో శాలువాలు కప్పి సత్కరించారు. గ్రామాల అభివృద్ధికి, కూటమి విజయానికి చేసిన సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.