E.G: పెరవలి మండలం నడుపల్లి కోటలో సమగ్ర శిక్ష నిధులతో రూ.23.95 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన విద్య అందించాలంటే పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు, సదుపాయాలు ఉండాలన్నారు.