KMM: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏప్రిల్ 2నుంచి ప్రభుత్వం రూపొందించిన భూభారతి పోర్టల్ను ఖమ్మం(D) కూసుమంచి, భద్రాద్రి(D) అశ్వరావుపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.