VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం. వీరకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు 2, మోసాలకు సంబంధించినవి 3 ఉన్నాయన్నారు.