KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం పత్తి ధరలు నిలకడగా కొనసాగాయి. గత వారం ముగింపులో (గురువారం) పలికిన గరిష్ఠ ధరనే ఈ వారం ప్రారంభంలోనూ మార్కెట్ దక్కించుకోవడం విశేషం. ఇవాళ మార్కెట్కు రైతులు మొత్తం 10 వాహనాల్లో 50 క్వింటాళ్ల విడి పత్తి తీసుకుని రాగా గరిష్ఠంగా రూ. 7,700, కనిష్ఠంగా రూ. 6,500 పలికింది. తక్కువ తేమ శాతం ఉండి, నాణ్యత ఉండాలన్నారు.