KMM: జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. వీటి ద్వారా 6572 కేసులు పరిష్కారమయ్యాయని, 77 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 36 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేశారని తెలిపారు. ఎఫ్ఎఆర్ కేసులు -764, ఈ పెట్టి కేసులు -1837, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 3971, సైబర్ కేసులు -77 పరిష్కరించినట్లు చెప్పారు.