KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయరుకు 5 వేల క్యూసెక్కుల నీటిని పంపుతున్నట్లు జలవనరుల శాఖ EE ఉమామహేశ్వర్లు ఆదివారం తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2,500 క్యూసెక్కుల నుంచి 5 వేల క్యూసెక్కులకు పెంచి నీటిని పంపుతున్నట్లు వెల్లడించారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం రిజర్వాయరుకు 2 టీఎంసీల నీటిని పంపు తామన్నారు.