SRCL: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చందుర్తి ఎస్సై జే. రమేష్ మండల ప్రజలను హెచ్చరించారు. క్రికెట్ జూదం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధిలో ఎవరైనా బెట్టింగ్లు నిర్వహించినా లేదా వాటిని ప్రోత్సహించినా చర్యలు తప్పవని తెలిపారు.