NRPT: నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన NSS వాలంటీర్లు శనివారం దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామంలో వేసవి శిబిరంలో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి జీవన విధానం, వ్యవసాయం, అక్షరాస్యత, కుటుంబంలో ఎంత మంది చదువుకున్నారు అనే విషయాలపై సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎండి షఫిక్ అహ్మద్, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.