WGL: నల్లబెల్లి మండలం మేడేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గ్రామ కార్యదర్శి అనిల్ లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.