అనకాపల్లి: నక్కపల్లి మండలం దేవవరం గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. సీఐ జె.మురళీ సమాచారం మేరకు ఎస్ఐ మల్లేశ్వరరావు సిబ్బందితో వెళ్లి చర్యలు చేపట్టారు. ఈ దాడిలో రూ.57,310 నగదు, నాలుగు బైక్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.