ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.