PPM: భామిని మండలంలోని నేరడు గ్రామానికి సమీపంలో ఏనుగుల గుంపు గురువారం హల్ చల్ చేశాయి. నాలుగు ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలు నాశనం చేశాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు వరి మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను దారి మళ్లించి అటవీ ప్రాంతానికి తరలించాలన్నారు.