ADB: ఆదిలాబాద్ పట్టణంలో ఈ నెల 27న శ్రీ రామ నవమిని పురస్కరించుకొని భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు రాళ్ల బండి మహేంద్ర తెలియజేశారు. బుధవారం పట్టణంలో స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. భవ్య రాముని భారీ శోభాయాత్ర శ్రీ గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమై పట్టణంలోని పలు వీధుల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు.