PLD: రొంపిచర్ల మండలంలోని కొనకంచివారి పాలెం గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాక్సిన్ మందులను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.