SRD: పటాన్చెరువు మండలం నందిగామలో ఏప్రిల్ 2న నిర్వహించనున్న చండీయాగానికి రావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్చెరువు కాంగ్రెస్ ఇంఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించారు. మంత్రిని తన నివాసంలో కలిసిన శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి భారీగా భక్తులు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.